మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు

మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు

వరంగల్‌ క్రైం: మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన వరంగల్‌లోని మట్టెవాడ రాజీవ్‌కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్‌ని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈస్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రూ.18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగా రు, 34 గ్రాముల వెండి అభరణాలతోపాటు రూ.10 వేలు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించి ప్రణయ్‌ని శుక్రవారం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌లో విచారించినట్లు తెలిపారు. ఈక్రమంలో ప్రణయ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జల్సాలు, బైక్‌ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అప్పు చేసినట్లు తెలిపారు. ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని ప్లాన్‌వేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన తన మేనత్త స్వరూప వద్దకు వెళ్లిన ప్రణయ్‌ ఆమెతో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. స్వరూప గాఢ నిద్రలో ఉన్న సమయంలో డంబెల్‌తో మేనత్త తలపై కొట్టినట్లు తెలిపారు. స్వరూప మరణించినట్లుగా నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతోపాటు ఇంట్లోని వెండి ఆభరణాలు, డబ్బును దోచుకొని వెళ్లినట్లు తెలిపారు.

170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీసీపీ

అంకిత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement