
కేఎంటీపీ టౌన్షిప్ పనులు పూర్తి చేయాలి
గీసుకొండ: వరంగల్ గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో భూములు కోల్పోయిన 863 మంది రైతులకు ప్లాట్ల కోసం అభివృద్ధి చేసిన ‘రాజీవ్ మెగా లేఅవుట్ టౌన్షిప్’ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి కేఎంటీపీని సందర్శించారు. టౌన్షిప్లో పురోగతిలో ఉన్న ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వ, మంచినీరు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వెంటనే లేఅవుట్ మంజూరు చేసి ప్లాట్లు కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్ చేయించాలని ‘కుడా’ అధికారులను ఆదేశించారు. గణేశా ఎకోపెట్, యంగ్వన్ కంపెనీల్లో తయారవుతున్న ఉత్పత్తులు, కై టెక్స్ కంపెనీలో జరుగుతున్న ట్రయల్రన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మూడు కంపెనీల ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులతో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. కేఎంటీపీలో వరద మంపును నివారించడానికి వంద మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కాల్వ పనులను పరిశీలించి సాంకేతికంగా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ఎంత వరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు పంపాలన్నారు. టీజీఐఐసీ చీఫ్ ఇంజనీర్ రవి, జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, గణేశ కంపెనీ వైస్ చైర్మన్ కేఎస్ రెడ్డి, హెచ్ఆర్ శంకర్, టీజీఐఐసీ, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
సంజయ్కుమార్
టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఉత్పత్తుల పరిశీలన