నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం

నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం

కాటారం(మహాముత్తారం): కాటారం, మహాముత్తారం మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డి మందు దందాను పోలీసులు, వ్యవసాయశాఖ అధికా రులు ఛేదించారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో ఎస్సై మహేందర్‌కుమార్‌, ఏఓ అనూష సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డి మందు నిల్వలను పట్టుకున్నా రు. కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్‌కుమార్‌ శుక్రవారం మహాముత్తారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరా లను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఘనికపూడికి చెందిన అచ్చ హన్మంతరావు, కాటారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ సమ్మిరెడ్డి, మల్హర్‌ మండలం పాతరుద్రారానికి చెందిన జాడి సమ్మయ్య, మహాముత్తారం మండలం నల్లగొండ మీనాజిపేటకు చెందిన చీర్ల సతీశ్‌, కాటారానికి చెందిన బొమ్మన వెంకట స్వామి, కొత్తపల్లికి చెందిన కందుల కోటేశ్వరరావు.. నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానితుల ఇళ్లలో శుక్రవారం దాడులు నిర్వహించగా.. భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందు గుర్తించినట్లు తెలిపారు. సుమారు రూ.5,06,250 విలువ చేసే 202.5కేజీల నకిలీ పత్తి విత్తనాలు, సుమారు రూ.1,20,000 విలువ చేసే 300లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనపర్చుకున్నట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. ఏఓ అనూష ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాటారం, మహాముత్తారం మండలాల్లో అధికారుల తనిఖీలు

ఆరుగురిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement