
బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడి మృతి
● మృతుడిది ఖమ్మం జిల్లా మద్దులపల్లి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాల బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడు మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ రాజేంద్ర ప్రసాద్(55) పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం బడిబాట కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా రాజేంద్ర ప్రసాద్కు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో (కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు) పాఠశాలలోనే ఉండాలని తోటి సిబ్బంది చెప్పి వెళ్లారు. ఈనేపథ్యంలో హాస్టల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్ కోసం భోజనం తీసుకుని క్వార్టర్స్కు రాగా.. బాత్రూంకు వెళ్లి వచ్చాక భోజనం చేస్తానని చెప్పాడు. ఎంతకూ బాత్రూంనుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది.. తలుపు తెరిచి చూడగా కింద పడిపోయి ఉన్నారు. దీంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడినుంచి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజేంద్ర ప్రసాద్కు భార్య ప్రమీలరాణి, కుమారుడు రామ్కుమార్, కుమార్తె స్రవంతి ఉన్నారు. ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య ఏటూరునాగారం వైద్యశాలకు వచ్చి వివరాలు సేకరించారు.

బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడి మృతి