
వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిపాదనల ప్రకారం నిధుల మంజూరు జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో కమిటీ సభ్యులు లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్