
ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి
తొర్రూరు:ప్లాస్టిక్ నిర్మూలనకు పట్టణవాసులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ అన్నారు. 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపార సముదాయాల్లో లభ్యమైన ప్లాస్టిక్ను సీజ్ చేయడంతో పాటు పలువురికి జరిమానా విధించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోనివారికి, లైసెన్స్ తీసుకోని వారికి జరిమానా విధించారు. అనంతరం జంగిల్ కటింగ్ చేశారు. తడిపొడి చెత్త వేరు చేయ డం, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రకృతికి విఘాతం కలిగి ంచే ప్లాస్టిక్ వాడొద్దన్నారు.