
టైరు పేలి కారు బోల్తా..
గీసుకొండ: టైరు పేలి కారు చెట్టుకు ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వరంగల్ జిల్లా గీసుకొండ పీఎస్ పరిధిలోని వసంతాపూర్ శివారులో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కారులో నలుగురు యువకులు వరంగల్ నుంచి కోట వెంకటాపురం వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వెంకటాపురం నుంచి వసంతాపురం గ్రామ శివారుకు చేరుకోగా వెనుక ఎడమవైపు టైరు పేలడంతో కారు అదుపు తప్పి చెట్టుకు ఽఢీకొని పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వరంగల్ ఎల్బీ నగర్కు చెందిన ఎండి. షోయబుద్దీన్(17), వరంగల్ చింతల్కు చెందిన షేక్ మహ్మద్(18) అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్బీ నగర్కు చెందిన ఎండి. సమీర్పాషా, జాన్పాకకు చెందిన ఎండి. ఇస్మాయిల్ అలీకి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. గీసుకొండ ఎస్సై ప్రశాంత్కుమార్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.
● ఇద్దరు యువకుల దుర్మరణం
● వసంతాపూర్ శివారులో ఘటన

టైరు పేలి కారు బోల్తా..