
నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు
చిట్యాల: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవన్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని నైన్పాక, కుమ్మరిపల్లి గ్రామాల్లో నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై శ్రవన్కుమార్తో పాటు, వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి సోదాలు నిర్వహించారు. నైన్పాకకు చెందిన జంగ కుమార్, కుమ్మరిపల్లికి చెందిన బిక్కనూరు విజయ్ అనుమతి లేని ఆర్–కొట్–999 బీటీ–5, 32 ప్యాకెట్లు, ది క్యాప్టన్ పింక్ గార్డ్ –5జీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. దీంతో ఆ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పత్తి విత్తనాల విలువ రూ.38 వేలు ఉంటుంది. ఈ ఘటనపై ఏఓ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై పేర్కొన్నారు.