
పూజారుల భవనం ప్రారంభం
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారంలో రూ. కోటి 98 లక్షలతో నిర్మించి సమ్మక్క, సారలమ్మ పూజారుల సముదాయ భవనాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క.. పూజారులతో సమావేశమై జాతర నిర్వహణపై చర్చించారు. జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజారులు మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రి సీతక్క తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు మంత్రి సీతక్కకు పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవీందర్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, పూజారులు కాక సారయ్య, అరుణ్కుమార్, భోజరావు, కాక కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.
హేమాచలుడిని దర్శించుకున్న ఎంఓపీఆర్డీ బృందం
మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి వారిని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ(ఎంఓపీఆర్డీ) భారత ప్రభుత్వ న్యూఢిల్లీకి చెందిన రాంబాబుగుప్తా, సమీ ఆశ్రర్ మిశ్రా బృందం గురువారం దర్శించుకుంది. అనంతరం మండలంలోని వాడగూడెం గ్రామాన్ని సందర్శించి పెసా చట్టం అమలు తీరుపై లఘు చిత్రం చిత్రీకరించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ ఎస్డీసీ డీటీ అనిల్, పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, టీజీఎండీసీ డీపీఓ మేకల కిరణ్, పెసా మొబిలైజర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బుల ముత్యాలరావు, మొబిలైజర్లు పూసం కార్తీక్, మడి శోభన్బాబు, పాయం రమేశ్, పూనెం రఘురాం, పున్నం శ్రవణ్, యాలం శ్రీను, తాటి విజయ్బాబు పాల్గొన్నారు.
7 నుంచి కరీంనగర్,
తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్
ఖిలా వరంగల్: జూలై 7వ తేదీ నుంచి కరీంనగర్– తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8న తిరుపతి– కరీంనగర్ వీక్లి వన్స్ ట్రైన్ నడవనుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

పూజారుల భవనం ప్రారంభం

పూజారుల భవనం ప్రారంభం