
రాఘవాపురాన్ని సందర్శించిన కేంద్ర బృందం
పాలకుర్తి టౌన్: కేంద్ర జలశక్తి పురస్కారానికి ప్రామాణిక అంశాలను పరిశీలించేందుకు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాఘవాపురం గ్రామాన్ని కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ సైంటిస్టు పి. యాదయ్య, కేంద్ర వాటర్ కమిషన్ సబ్ డివిజన్ ఇంజనీర్ డి. చైతన్య సందర్శించారు. గ్రామంలో పదేళ్లలో భూగర్భ జలాలు పెంచడానికి చేపట్టిన పనులను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా యాదయ్య, చైతన్య మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయన్నారు. పురస్కారం అందజేయడానికి దేశంలో 30 గ్రామాలను ఎంపిక చేశామని, ఇందులో తెలంగాణలో రాఘవాపురం గ్రామం ఎంపికై ందన్నారు. రాఘవాపురంలో వందశాతం ఇంకుడు గుంతలు, వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయిందన్నారు. గ్రామంలో చేపట్టిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించామన్నారు. నివేదికను కేంద్ర భూగర్భ జలవనరుల శాఖకు అందజేస్తామని తెలిపారు. వారి వెంట డీఆర్డీఓ పీడీ వసంత, ఎంపీడీఓ ఆవుల రాములు, ఏపీఓ మంజుల, ఎంపీఓ రవీందర్, పంచాయతీ కార్యదర్శులు మహేందర్, కపిలవాయి వెంకటేశ్వరాచారి, యుగేంధర్, శీరిష, ప్రియాంక, మహేశ్యాదవ్, లింగయ్య తదితరులు ఉన్నారు.
కేంద్ర జలశక్తి పురస్కారానికి ప్రామాణిక అంశాల పరిశీలన