
విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలను గురువారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాడీ వరుణ్రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడా ప తాకాన్ని ఆవిష్కరించిన ఆయన క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ని రంతరం విధుల్లో ఉంటూ ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు క్రీడా పోటీలతో మానసిక, శారీరక విశ్రాంతి లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారందరం అన్నదమ్ములమే.. పోటీల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ వరంగల్(ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీ ఎల్, ట్రాన్స్కో) ఆధ్వర్యాన ఈనెల 14 వరకు జరిగే ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ క్రీడా పో టీలు ఉంటాయని, కబడ్డీ 12 జట్లు, బాల్బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్కుమార్, టి.సదర్రలాల్, వి.తిరుపతిరెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్రా వు, డీఈ టెక్నికల్ ఎ.విజయేందర్రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, కోశాధికారి ఎం. సంతోష్, కౌన్సిల్ సభ్యులు యాకూబ్పాషా,సునీల్కుమార్, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం