పాఠశాలకు కొత్తందాలు.. | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు కొత్తందాలు..

Jun 12 2025 3:09 AM | Updated on Jun 12 2025 3:09 AM

పాఠశాలకు కొత్తందాలు..

పాఠశాలకు కొత్తందాలు..

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక పాఠశాల 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు రంగులు వెలిసిపోయి కళాహీనంగా మారింది. అయితే జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రామసహాయం శ్రీధర్‌ రెడ్డి ప్రత్యేక చొరవచూపి ఎంపీపీఎస్‌ రూపురేఖలను మార్చా రు. దాతల సహకారంతో రంగలు వేయించారు. విద్యార్థులకు అవసరమైన విద్యాబోధనకు సంబంధించిన పట్టికలు, ఇతర అంశాలను భవనం గోడలపై చిత్రీకరింపజేశారు. దాతలు శేరి వీరయ్య రూ.20 వేలు, బిర్రు కిరణ్‌, మరికొంతమంది దాతల సహకారంతో పాఠశాల అందంగా ముస్తాబై నేడు విద్యార్థులకు అపూర్వ స్వాగతం పలకనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement