
కొంచెం భయం.. కొంచెం సంతోషం
సాక్షి, మహబూబాబాద్: నేను కుటుంబంలో చిన్న వాడిని.. మా కుటుంబ సభ్యులమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం. నేను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా పైతాను తాలూకా, జయక్వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. సెలవుల తర్వాత బడికి వెళ్లాలంటే ఏదో తెలియని భయం.. ఇబ్బందిగా ఉండేది. కానీ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ను కలుస్తామని సంతోషంగా ఉండేది. పాఠశాల తెరిచిన నాటి నుంచి వారం రోజుల పాటు వేసవి సెలవుల్లో ఎవరెవరూ ఏం చేశారు.. ఏ ఊరు వెళ్లారు అనే విషయాలతోనే కాలం గడిచేది. మిత్రులం కలిసినప్పుడు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటాం. ప్రతీ ఒక్కరి జీవితంలో పాఠశాల రోజులు గోల్డెన్ డేస్... మరుపురాని రోజులు. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ, మహబూబాబాద్