పాఠశాలల సందర్శన | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల సందర్శన

Jun 12 2025 3:09 AM | Updated on Jun 13 2025 2:37 PM

మరిపెడ: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోనున్నాయని, హెచ్‌ఎంలు ముందస్తుగా పాఠశాలలను శుభ్ర ంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు అ న్ని సౌకర్యాలు అందేలా చూడాలన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో శానిటేషన్‌ పనులు చేపట్టాలన్నారు. ఆయన వెంట ప్రత్యే క అధికారి కిరణ్‌కుమార్‌, మరిపెడ మున్సిపల్‌ కమిషనర్‌ నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు రుణాలివ్వండి

గూడూరు: మండలంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూమి పట్టాలున్న రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు కార్యాలయంలో బుధవారం రుణాల మంజూరుపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక మారుమూల ఏజెన్సీ మండలం అని, ఇక్కడి రైతులకు ఎక్కువగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాలు హక్కు పత్రాలు ఉన్న రైతులకు రుణాలు ఇస్తామని చెబుతుండగా, బ్యాంకు అధికారులు ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటికై నా మండలంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు వెంటనే రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రులను కలిసిన డిప్యూటీ స్పీకర్‌

మరిపెడ రూరల్‌: నూతనంగా ఎంపికై న డిప్యూటీ స్పీకర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్‌ మంత్రులను శాలువాలతో సన్మానించారు.

విత్తనభారం.. వానపైనే!

బయ్యారం/కొత్తగూడ: తొలకరికి ముందే కురిసిన వర్షాలతో మెట్ట పంటలసాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కురిసిన చిరు జల్లులకు బుధవారం బయ్యారం, కొత్తగూడ మండలాల్లో కొందరు రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు నాటారు. అయితే మళ్లీ వర్షం కురిస్తేనే నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి. కాగా వానదేవుడిపైనే భారం వేసి రైతులు ఏరువాకను మొదలు పెట్టారు.

నేడు రైల్వే సేఫ్టీ ఆడిట్‌ బృందం పర్యటన

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లో గురువారం ఇంటర్‌ రైల్వే సేఫ్టీ అడిట్‌ సికింద్రాబాద్‌ అధికారుల బృందం పర్యటించనున్నట్లు బుధవారం రాత్రి కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి అధికారుల బృందం ప్రత్యేక రైలులో రియర్‌ విండో ద్వారా రైల్వే గేట్లు, సిగ్నల్స్‌, నష్కల్‌–పెండ్యాల మధ్య రైల్వే బ్రిడ్జిలు, ఇతర సేఫ్టీ చర్యలను తనిఖీ చేసుకుంటూ 1:30 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటారు. 

జంక్షన్‌లోని రైల్వే గెస్ట్‌హౌస్‌లో అధికారులకు లంచ్‌ ఉంటుంది. తర్వాత క్యారియజ్‌ అండ్‌ వ్యాగన్‌ డిపో, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్‌రూం కార్యాలయాల్లో సేఫ్టీ ఆడిట్‌ తనిఖీ ఉంటుంది. 3:00 గంటల నుంచి 05:30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఐ కార్యాలయం, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ కార్యాలయం, రైల్వే పాయింట్‌, క్రాసింగ్‌, ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఆర్‌టీ, ఎస్‌పీఎంఆర్‌వీలలో తనిఖీ చేస్తారు. అనంతరం కాజీపేట నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరి సికింద్రాబాద్‌కు వెళ్తారని రైల్వే అధికారులు తెలిపారు.

పాఠశాలల సందర్శన 1
1/1

పాఠశాలల సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement