
రెవెన్యూ సదస్సులపై అవగాహన పెంచుకోవాలి
గూడూరు: గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులపై రైతులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ అన్నారు. మండలంలోని మట్టెవాడ, మధనాపురంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులతో పాటు మట్టెవాడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, గూడూరులో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ బాలుర హైస్కూల్, బ్రాహ్మణపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్రెడ్డి, సీడీపీఓలు నీలోఫర్ అజ్మీ, శిరీష, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్