సీహెచ్‌సీలో మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌సీలో మౌలిక వసతులు కల్పించాలి

Jun 11 2025 11:34 AM | Updated on Jun 11 2025 11:34 AM

సీహెచ్‌సీలో మౌలిక వసతులు కల్పించాలి

సీహెచ్‌సీలో మౌలిక వసతులు కల్పించాలి

గూడూరు: కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అవసరమైన మౌలిక వసతులతో పాటు వైద్యులను నియమించాలని సూపరింటెండెంట్‌ వీరన్న కోరారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీని మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ సందర్శించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి, లోపల వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏమైనా అవసరాలు ఉంటే చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరన్న మాట్లాడుతూ.. ఆసుపత్రిలో మొత్తం 16 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా, ఐదుగురు మాత్రమే ఉన్నారన్నారు. వైద్యుల నియామకానికి కృషి చేస్తానని హుస్సేన్‌నాయక్‌ అన్నారు. అదే విధంగా పాకాలవాగు సమీప పోస్టుమార్టం గది వద్ద విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని, శవాలను భద్రపరిచేందుకు రెండు ఫ్రీజర్లు అవసరమని సూపరింటెండెంట్‌ చెప్పగా తప్పక ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం చెంద్రుగూడెంలోని ఏకలవ్వ పాఠశాల నిర్మాణ పనులను హుస్సేన్‌నాయక్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ వెంకట్రాములు, తహసీల్దార్‌ నాగభవాని, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement