ఆటోను ఢీకొన్న లారీ.. | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ..

Jun 11 2025 11:34 AM | Updated on Jun 11 2025 11:34 AM

ఆటోను ఢీకొన్న లారీ..

ఆటోను ఢీకొన్న లారీ..

స్టేషన్‌ఘన్‌పూర్‌: లారీ.. ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన స్టేషన్‌ఘన్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన సింగారపు రమేశ్‌(42) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఆటో నడుపుకుంటూ జనగామ నుంచి హనుమకొండకు వస్తున్నాడు. ఆటో స్టేషన్‌ఘన్‌పూర్‌కు రాగానే హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు రమేశ్‌ కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుమ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ లింగస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా, ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

అక్కడికక్కడే ఆటోడ్రైవర్‌ మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement