
అమ్మవారిని దర్శించుకున్న ట్రెయినీ ఐఏఎస్లు
హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం 2024 ట్రెయినీ ఐఏఎస్లు సౌరభ్శర్మ, సలోని ఛబ్రా సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన ఐఏఎస్లను ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు వారికి స్నపనమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఆలయ చరిత్ర వివరించారు. అదేవిధంగా.. ఖిలా వరంగల్ కోటను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. వారి వెంట రామ్రెడ్డి, కుమారస్వామి, శ్యామ్లాల్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మామునూరు: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్నగర్ కాలనీకు చెందిన కస్తూరి కుమార్(55), అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కూలీ లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన కస్తూరి కుమార్ సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బావమరిది రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు సీఐ రమేష్ తెలిపారు.