వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

Jun 10 2025 3:40 AM | Updated on Jun 10 2025 3:40 AM

వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

ఎల్కతుర్తి : వివాహిత హత్యకేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ముల్క నూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌కు చెందిన మృతురాలు కోల సుమలత, నిందితుడు గూళ్ల రాజు ఇళ్లులు పక్కపక్కన ఉంటాయి. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం రాజుకు చెందిన లేగదూడ చని పోయిన విషయంలో గొడవ జరిగింది. ఈ ఘటనలో సుమలత బావ సంపత్‌ను కొట్టిన విషయంలో రాజుపై ముల్కనూరు పీఎస్‌లో కేసు నమోదైంది. దీంతో రాజు రెండు రోజులు జైలుల్లో ఉండి బెయిల్‌ పై బయటకు వచ్చాడు. ఈ కేసులో సుమలత ప్రత్య క్ష సాక్షిగా ఉండగా నిందితుడు తనను పలుమార్లు రాజీ పడాలని కోరగా సుమలత వినలేదు. ఈ కేసులో సాక్ష్యం చెప్పొద్దని, రాజీ పడాలని రాజు.. సుమలత ఇంటికెళ్లి చంపుతానని బెదిరిస్తున్న సమయంలో మృతురాలి కుమారుడు వెంకటేశ్‌ అడ్డొచ్చాడు. దీంతో అతడిపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటనలో ఇదే పీఎస్‌లో రాజుపై హత్యాయత్నం కేసు న మోదు కాగా నిందితుడు 60 రోజుల పాటు జైలులో ఉండి మెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే మొదటి కేసు ట్రయల్‌కు వచ్చింది. ఈ నెల 11న పేషీ ఉంది. ఈ కేసులో సుమలత సాక్ష్యం చెప్పితే శిక్ష పడుతుందని తెలిసి కొన్ని రోజుల నుంచి రాజు.. సుమలతను రాజీపడమని బెదిరించగా ఆమె వినలేదు. ఈ క్రమంలో ఈనెల 5న సుమలత ఇంటివద్ద ఉంది. దీంతో సుమలతను చంపితే కేసులో శిక్ష నుంచి తప్పించుకోచ్చని భావించిన రాజు.. గొడ్డలితో ఆమైపె దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ముల్క నూరు గ్రామ శివారులో కనిపించగా పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో సమర్థవంత విధులు నిర్వర్తించిన సీఐ పులి రమేశ్‌, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్‌కుమార్‌, దివ్యను ఏసీపీ అభినందించారు.

వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement