
భూమి కబ్జా చేశారని మనస్తాపం..
ఖిలా వరంగల్: తమ జీవనాధారమైన 14 గుంటల భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట తాళ్లపద్మావతి కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూ మిని విక్రయించగా.. మిగతా 14గంటల భూమి ఉర్సు గుట్ట తాళ్లపద్మావతి కళాశాల సమీపంలో ఉంది. ఇటీవల తాళ్ల మల్లేశం, బండి కుమారస్వామి, పులి రజింత్రెడ్డి అనే వ్యక్తులు 14 గుంటల భూమి కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తమదేన ని పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్బాషలా డుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తా పం చెందిన కుమారస్వామి సోమవారం సాయంత్రం తన భూమి వద్దకు వెళ్లాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్ నోట్ రాసి ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈవి షయం తెలిసిన వెంటనే మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితుడి బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడికి 80 శాతంపైగా గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించారు.
ముగ్గురిపై కేసు నమోదు..
తన 14 గంటలు భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ పొలెపాక కుమారస్వామి ఆత్మహత్యకు యత్నించి ఎంజీఎంలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపై కుమారస్వామి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు పులి రజింత్రెడ్డి, బండి కుమారస్వామి, తాళ్ల మల్లేశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఉర్సుగుట్టలో ఘటన
న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్నోట్