
దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పాలియేటివ్ కేర్ విభాగంలో అద్దెకు వాహనం పెట్టడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సోమవారం తెలిపా రు. వాహనం అన్ని మండలాలు, గ్రామాల్లో తిరగాల్సి ఉంటుందని, ప్రతీ నెల 25 వేల కిలోమీటర్లు తిరగాలని, ఇందుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. వాహనంలో ముగ్గురు లేదా నలుగురు కూర్చునేలా ఉండాలని, ఎమర్జెన్సీ సమయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వాహనానికి జీపీఎస్ ట్రా కింగ్ అమర్చబడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖలో సమర్పించాలన్నారు.
రుచికరమైన
భోజనం అందించాలి
తొర్రూరు: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జీసీడీఓ విజయకుమారి అన్నా రు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల వంట సిబ్బందికి నూతన మెనూపై సోమవారం డివి జన్ కేంద్రంలోని కేజీబీవీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయకుమారి మాట్లాడు తూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని, శుచి, శుభ్రతతో వంటలు చేయాలన్నా రు. కస్తూర్బాల్లో విద్యతో పాటు మంచి ఆహా రం అందించేందుకు కృషి చేస్తున్నామన్నా రు. ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య, ఎస్ఓ శైలజ, సిబ్బంది ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. సీజనల్ వ్యాధులపై మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాల కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, తండాల్లో వర్షపు నీరు నిల్వకుండా చూడాలని, మురికి కాలువలు శుభ్రం చేయాలని, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. వినియోగంలో లేని బావులు, నీటి కుంటలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ లేదా దోమల మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలని, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ వంద రోజుల క్యాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, ఎంపీఓ పార్థసారథి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబాబాద్ టౌన్
సీఐగా మహేందర్రెడ్డి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ టౌన్ సీఐగా జి.మహేందర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ మల్టీజోన్ వన్ ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహబూ బాబాద్ టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న పెండ్యాల దేవేందర్ను హైదరాబాద్లోని మల్టీజోన్ వన్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పాలకుర్తి సీఐగా పనిచేస్తున్న జి.మహేందర్ రెడ్డి మహబూబా బాద్ టౌన్ సీఐగా విధుల్లో చేరనున్నారు.
భవనంలేని బడికి..
పిల్లల్ని ఎలా పంపాలి
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారితండాలో ప్రాథమిక పాఠశాలకు సొంతభవనం లేకపోవడంతో.. 24ఏళ్లుగా అద్దె భవనంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. భవనం మంజూరైనప్పటికీ..నిర్మాణ పనులు మధ్యలో నే నిలిచిపోయాయి. కాగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించగా.. సొంత భవనం లేని పాఠశాల కు పిల్లల్ని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో టీచర్ల నుంచి సమాధానం లేదు. కాగా ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు,18 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏ డాది కూడా వంటమనిషి ఇంట్లోనే బడి నడిపించాల్సి వస్తుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం