
వినతులు వెంటనే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి
● ప్రజావాణిలో 87 అర్జీల అందజేత
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతుల ను నిర్లక్ష్యం చేయండా వెంటనే పరిష్కరించాలని అ దనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ.. పెండింగ్ వినతులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరి ష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గమనించాలన్నారు. మొత్తం 87 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, డీడబ్ల్యూఓ ధనమ్మ,ఆర్అండ్బీ ఈఈ బీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు పిల్లలు అంధులే.. ఆదుకోవాలి
మాకు 10 సంవత్సరాల అమ్మాయి గీతిక, 9 సంవత్సరాల అబ్బాయి చరణ్తేజ్ ఉన్నారు. ఇద్దరు పుట్టుకతోనే అంధులు, వారిని అంధుల పాఠశాలలో చేర్పించాం. 40శాతమే అంధత్వం ఉందని సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ వారికి పూర్తిగా కనబడదు. వందశాతం అంధులుగా సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. మేము బతుకు దెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్నాం.
– జి.నవీన్–అనూష, పిల్లల తల్లిదండ్రులు,
జయ్యారం, చిన్నగూడూరు మండలం
భూమి అమ్మిన వ్యక్తే ఇబ్బంది పెడుతున్నాడు
కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 సంవత్సరాల క్రితం 3ఎకరాల భూమి కొనుగోలు చేశాం. ఆ భూమి అమ్మిన వ్యక్తి కారుపోతుల బాలరాజు ప్రస్తుతం ఆ భూమిలో 23గుంటలు తనదేనని ఇబ్బంది పెడుతున్నాడు. నా భర్త సోమయ్య మూడు నెలల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి బాలరాజు ఇబ్బంది పెడుతున్నాడు. సంబంధించిన అన్ని పత్రాలు మా వద్ద ఉన్నాయి. అధికారులు సర్వే చేసి పత్రాలు పరిశీలించి న్యాయం చేయాలి.
– రాయిలి సోమలక్ష్మి, ఉపేందర్, తల్లీకుమారుడు,
చెట్ల ముప్పారం, ఇనుగుర్తి మండలం
●

వినతులు వెంటనే పరిష్కరించాలి

వినతులు వెంటనే పరిష్కరించాలి