హైరిస్క్‌ గర్భధారణపై జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

హైరిస్క్‌ గర్భధారణపై జాతీయ సదస్సు

Jun 9 2025 7:45 AM | Updated on Jun 9 2025 7:45 AM

హైరిస్క్‌ గర్భధారణపై  జాతీయ సదస్సు

హైరిస్క్‌ గర్భధారణపై జాతీయ సదస్సు

పాల్గొన్న గైనకాలజిస్టులు, సర్జన్లు

హైదరాబాద్‌: యశోద హాస్పిటల్స్‌–హైటెక్‌సిటీ ప్రసూతి, గైనకాలజీ విభాగం అధ్వర్యంలో హై రిస్క్‌ గర్భధారణపై ఆదివారం జాతీయ స్థాయి సదస్సు, లైవ్‌వర్క్‌షాప్‌ నిర్వహించారు. 500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యశో ద గ్రూప్‌ ఆప్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవ న్‌ గోరుకంటి మాట్లాడుతూ ఈ సదస్సులో విభిన్న వైద్య విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారన్నారు. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ నూతన మార్గదర్శకాలు, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సంక్లిష్టమైన సర్జరీలను మరింత సులభంగా, ఖచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారనానరు. యశోద హాస్పిటల్‌ సీనియర్‌ గైనకా లజిస్ట్‌ డాక్టర్‌ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో విజయవంతంగా తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.

బాలు పాటలు చిరస్థాయిగా

నిలిచిపోతాయి: తనికెళ్ల

హైదరాబాద్‌: చరిత్ర ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని తనికెళ్ల భరణి అన్నారు. ఆదివారం రాత్రి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగానసభలో కొండూరి భారతి సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మవిభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ పుట్టినరోజు సందర్భంగా సినీనటులు తనికెళ్ల భరణికి ఎస్పీ బాలు నటనా పురస్కారాన్ని అంద జేశారు. వంశీ సంస్థల అధినేత వంశీ రామరా జు అధ్యక్షతన జరిగిన సభలో అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ప్రముఖ దర్శకులు రేలంగి నర్సింహారావు , తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గాయకుడు చింతలపూడి త్రినాథరావు, సినీనేపథ్య గాయకుడు వినోద్‌బాబు, రామచారి, శశికళాస్వామి విజయలక్ష్మి, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 79 పాటలతో 21 మంది గాయనీ గాయకులతో నిర్వహించిన ఏకగళ స్వరార్చన అందరినీ అలరించింది.

క్లుప్తంగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement