బీవీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

బీవీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

Jun 9 2025 7:45 AM | Updated on Jun 9 2025 7:45 AM

బీవీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

బీవీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

విద్యారణ్యపురి: సామాజిక స్పృహ కలిగిన మేధావుల కలయికతో ఏర్పాటైన భారత్‌ వికాస్‌ పరిషత్‌ (బీవీపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ సంస్థ దక్షిణ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి డి. పురుషోత్తం శాస్త్రి కోరారు. ఆదివారం హనుమకొండలోని వాగ్దేవి కాలేజీ సెమినార్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథి గాపాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి, విలువలు పెంపొందించాలన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలపై చైతన్య పర్చాల్సిన అవసరం ఉందన్నారు. బీవీపీ శాఖల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థు, రైతులకు చేయూతనివ్వడంతోపాటు ఉచిత వైద్యశిబిరాలను కూడా విస్తృతంగా చేపట్టాలన్నారు. ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ నిర్మాణం, కెపాసిటీ బిల్డింగ్‌తో బీవీపీని మరింతగా బలోపేతం చేయాలన్నారు. బీవీపీ ప్రాంత అధ్యక్షుడు నాగశేఖరగుప్తా మాట్లాడుతూ భగవద్గీతలో మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉన్నాయని, భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెడితే బాగుంటుందని సూచించారు. ఈ సభలో దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి ఇ.డి నాగరాజు, ఓరుగల్లు బీవీపీ అధ్యక్షుడు డి. సుధీర్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ కె. సత్యనారాయణ, రాష్ట్ర రీజినల్‌ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, వి.వి నాగేందర్‌, మాధవీలత, ఫణీకుమార్‌, ఓరుగల్లు శాఖ కార్యదర్శులు శివరామకృష్ణ, బి. వెంకటరెడ్డి, చంచల్‌ అగర్వాల్‌, వివేకానంద, రత్నమంజు మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటలవరకు ఈ వర్క్‌షాప్‌ కొనసాగింది.రాష్ట్రంలోని 25 శాఖల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి

పురుషోత్తం శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement