
పొంచి ఉన్న ముప్పు!
సాక్షి, మహబూబాబాద్: వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువ అవుతుంది. డెంగీ, మలేరియా జ్వరాలతోపాటు, టైఫాయిడ్, ఇతర జ్వరాలతో ఏజెన్సీ గూడేలు, గిరిజన పల్లెల్లో జనం ఇబ్బందులు పడుతారు. ఏటా మాదిరిగానే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీం ఏటా ఏదో మూలన తాగునీటి కలు షితం, అపరిశుభ్ర వాతావరణంతో ఇబ్బందులు, వైద్య సేవలు అందక ఇక్కట్లు పడుతున్నారు. అయి తే ఈ ఏడాదిలో ఇప్పటికే డెంగీ, మలేరియా కేసుల నమోదు మొదలైంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ముందస్తు ముప్పును పసిగట్టి నివారణకు మార్గం చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
భయం భయంగా..
ప్రతీ సంవత్సరం డెంగీ విజృంభనతో ప్రజలు జ్వ రాల బారిన పడి మరణించిన సంఘటనలు ఉండటంతో వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో ప్రధానంగా గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భయంభయంగా గడపాల్సి వస్తోంది. జిల్లాలో 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు, 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 300పైగా గ్రామాలు ఏజెన్సీ, గిరిజన తండాలే ఉన్నాయి. ఇక్కడ సరైన వైద్యం అందకపోవడం, పారిశుద్ధ్య పనులు చేయకపోవడం, తాగునీరు కలుషితం కావడంతో గతేడాది 419 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే ప్రాణాలతోపాటు, నిరుపేద గిరిజనులు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.
పైసలు లేవు.. ప్రణాళికలు లేవు
వర్షాకాలం రాకముందే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ నాలుగు సంవత్సరాలుగా దోమ తెరలు రాలేదని గిరిజనులు చెబుతున్నారు. అదే విధంగా డెంగీ, మలేరియా పరీక్షలు చేసేందుకు ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాల్సిన ఆర్డీటీ (రాపిడ్ డైగ్నో టెస్ట్) కిట్లు ఇప్పటి వరకు రాలేదు. పీహెచ్సీల్లో సరిపడా మందులు కూడా రానట్లు సమాచారం. అదే విధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయ డం బ్లీచింగ్, ఫాగింగ్ మొదలైన పనులకు నిధులు లేవు. దీంతో అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
మొదలైన విష జ్వరాలు
భయం భయంగా ఏజెన్సీ పల్లెలు
అధికారుల పనితీరుపై
ఉన్నతాధికారుల ఆగ్రహం
2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో
మలేరియా, డెంగీ కేసుల వివరాలు
సంవత్సరం మలేరియా డెంగీ
2020 22 07
2021 30 43
2022 20 125
2023 06 40
2024 11 419
సమన్వయం అవసరం..
వర్షాకాలం ఆరంభంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే ప్రధానంగా పంచాయతీ, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా శాఖల మధ్య సమన్వయం అవసరం. ఈ శాఖలు సమన్వయంలో పనిచేయడం లేదని, కొన్నిచోట్ల కో–ఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టలేదని తెలిసింది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి నెలకొంటే వర్షాలు ఎక్కువ కురిసి, దోమల స్వైర విహారం మొదలైతే జ్వరిపీడితుల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికై నా కమిటీలు వేసి ఏరోజు డేటా ఆరోజు నమోదు చేయాలని జిల్లా అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది.
అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. ఇటీవల కలెక్టర్తో జిల్లా స్థాయి అధికారుల సమీక్షలు జరిగాయి. మండల స్థాయిలో పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, తాగునీటి సరఫరా అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తాం. దోమ తెరల పంపిణీ విషయం మా పరిధిలో లేదు.
– రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి