
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
దంతాలపల్లి మండలం ఆగాపేటతండా గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపిక చేశారు. విద్యార్థుల తాగునీరు, మరుగుదొడ్ల కోసం రూ.90వేల నిధులు మంజూరు చేశారు. పనులు పూర్తి చేయగా.. కాంట్రాక్టర్కు రెండు దఫాల్లో రూ.57వేలు చెల్లించారు. అయితే పనుల్లో నాణ్యత లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కల్యాణ రామయ్య తెలిపారు. ఇనుప నల్లాలకు బదులు ప్లాస్టిక్ నల్లాలు ఏర్పాటు చేయడంతో కొన్ని విరిగిపోయాయని చెప్పారు. అలాగే పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్మోటారు నాణ్యత లేక కాలిపోయిందని, ప్రస్తుతం విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు.
న్యూస్రీల్

శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025