
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్: సీజనల్ వ్యాధులపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాయల ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. వానాకాలంలో కార్మికులు పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. దోమలు, ఈగల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు బయట పడుతాయన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. కార్యక్రమంలో డీఈ ఉపేందర్, మెప్మా డీఎంసీ విజయ, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, వైద్యులు నాగేశ్వర్రావు, మౌనిక, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యలపై దృష్టి సారించాలి..
డోర్నకల్: భూసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మండలంలోని పెరుమాళ్లసంకీస, బొడ్రాయితండా, ఉయ్యాలవాడ, చాప్లాతండా గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కాగా బొడ్రాయితండా రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్ రికార్డులను తనిఖీ చేశారు. రైతుల దరఖాస్తులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూసమస్యల పరిష్కారంపై సిబ్బంది దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీ వీరన్న, తహసీల్దార్ ఇమ్మానీయల్, ఆర్ఐ యాసీన్ తదితరులు పాల్గొన్నారు.
యువకుల జలకాలాట..
గార్ల: ఉక్కపోతను తట్టుకోలేక, వేసవితాపం తీర్చుకునేందుకు యువకులు గార్ల సమీపంలోని పాకాల ఏటిలో జలకాలాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏటిలో యువకులు ఈత కొడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది.
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి