
పనులు నాణ్యత లేక మళ్లీ మొదటికి..
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఏ మేరకు పనులు జరుగుతున్నాయో పరిశీలించే వారు కరువయ్యారు. దీంతో బోరు మోటారు కాలిపోయింది. నాసిరకం నల్లాలు పెట్టడంతో విరిగిపోయాయి. మరుగుదొడ్లు పాడయ్యాయి. దీంతో పనులు చేసినట్లు అధికారులు చెప్పినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి.
– భూక్య శ్రీను, ఆగాపేటతాండవాసి
ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశాం..
గతంలో రజాలిపేట, పత్తిపాక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశాం. వర్షాకాలంలో పత్తిపాక ప్రైమరీ పాఠశాల భవనం ఉరుస్తుంది.. కూలిపోయే పరిస్థితిలో ఉంది. రజాలిపేట స్కూల్లో వంటగదిలేక వంట మనుషులు ఇంటి దగ్గర నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుకొని తీసుకొస్తున్నారు
– డి.వీరన్న, రజాలిపేట, విద్యార్థి తండ్రి
నిధులు వస్తే మరమ్మతులు చేయిస్తాం
గతంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం నుంచి వచ్చిన నిధులు స్కూళ్లకు వినియోగించాం. పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరకున్న పాఠశాలల భవనాలకు బదులు అద్దె భవనాల్లో తరగతులు కొనసాగించాం. విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ప్రత్యేక నిధులు వస్తే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయిస్తాం.
– ఏ.రవీందర్ రెడ్డి, డీఈఓ
●

పనులు నాణ్యత లేక మళ్లీ మొదటికి..

పనులు నాణ్యత లేక మళ్లీ మొదటికి..