
ఫీజులను భరించలేకున్నాం
నాకు వ్యవసాయమే జీవనాధారం. ఇద్దరు పిల్లలు సంతానం. గూళ్యంలోని ప్రయివేట్ పాఠశాలలో ఒక అబ్బాయి ఐదో తరగతికి, మరో అబ్బాయి 3వ తరగతి చదువుతున్నారు. మొదటి అబ్బాయికి అడ్మిషన్ ఫీజు రూ.25 వేలు. 3వ తరగతి చదువుతున్న అబ్బాయికి రూ.20 వేలు దాకా తీసుకుంటున్నారు. స్కూల్ యూనిఫాం, షూకు రూ.6 వేలు అదనంగా చెల్లించాలి. సంవత్సరానికి రూ.50 వేలకు పైగానే ఖర్చు అవుతోంది. అంత డబ్బు చెల్లించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. జూన్ నెల వస్తుందంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్లు ఉంటుంది.
– మునిస్వామి, సిద్ధాపురం గ్రామం, హాలహర్వి మండలం

ఫీజులను భరించలేకున్నాం