
అప్కాస్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అప్కాస్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అప్కాస్ ఇంజినీరింగ్ ఉద్యోగులు 30 రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రెండు రోజుల క్రితం సమ్మె బాట పట్టారు. ఈ మేరకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వారికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్కాస్ కింద పనిచేసే ఉద్యోగులకు రూ.13 వేల వేతనం మాత్రమే చెల్లిస్తుండటం దారుణమన్నారు. రేషన్ కార్డులు మంజూరు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇతర సిబ్బందికి లభిస్తున్న 69 సెలవులను మంజూరు చేయాలన్నారు. ఉద్యోగంలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్వీ వెంట వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి షరీఫ్, మైనార్టీ నగర అధ్యక్షుడు పట్టా బాషా కంటూ, బాబు, మధు, శివ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ