
పిల్లల చదువు భారమవుతోంది
మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు కర్నూలులోని కెవిఆర్ కాలేజీలో చదువుతున్నారు. మరొకరు సీ క్యాంపు దగ్గర ఉన్న కాలేజీలో చదువుతున్నారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఫీజుల పథకం కింద మొత్తం ఫీజులు చెల్లిస్తామని చెప్పినారు. కానీ ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మాలాంటి పేదలు పిల్లలను చదివించుకోవాలంటే భారంగా ఉంది. ఆ డబ్బులు ఇచ్చింటే కొంచెం ఊపిరాడేది.
– మణెమ్మ, రైతు కూలీ, సింగవరం
ఆ బడులను చూస్తే
చదువుకోవాలనిపిస్తాది
గత ప్రభుత్వం బడులను ఎంతో బాగా కట్టించింది. వాటిని చూస్తేనే పిల్లలకు బడికి పోవాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రయివేట్ స్కూళ్లు మాన్పించి ప్రభుత్వ బడికి పంపించినారు. మధ్యాహ్న భోజనం కూడా చానా బాగుందని అందరూ చెబుతుండ్రి. ఇప్పుడేమో ఆ స్కూళ్లను ఎవరూ పట్టించుకుంటలేరు. కొన్ని స్కూళ్లను తీసేస్తున్నారంట. ఇంకా బాగు చేయాలి కానీ, ఇలా చేస్తే పిల్లలు ఎట్టా బాగుపడతారు.
– ఎలీసా, ఉల్చాల గ్రామం
●

పిల్లల చదువు భారమవుతోంది