
సర్వర్ పనిచేయక.. సరుకులు అందక !
రేషన్ సరుకులకు మళ్లీ జనానికి తిప్పలే. దుకాణం తెరిచి ఉందో లేదోనని పిల్లలను చూసి రమ్మని పంపడం ఇక మీదట కార్డుదారులు అలవాటు చేసుకోవాల్సిందే. ఇంట్లో ఎవరో ఒకరు పని మానుకొని దుకాణం వద్ద పడిగాపులు కాయాల్సిందే. అంతేకాదు.. ఇప్పుడు సర్వర్ పని చేస్తుందో లేదోననే బెంగ కూడా కార్డుదారులను వేధిస్తోంది. ఒకటో తేదీ నుంచి సరుకుల పంపిణీ ప్రారంభం కాగా అస్తవ్యస్త పంపిణీ స్వాగతం పలకడం తెలిసిందే. ఇక రెండో రోజు సోమవారం కర్నూలు నగరంలో సర్వర్ సమస్యతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ కారణంగా కార్డుదారులు దుకాణాల చుట్టూ రోజంతా తిరగడంతోనే సరిపోయింది. రాత్రి సమయంలోనూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో సరుకులు తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

సర్వర్ పనిచేయక.. సరుకులు అందక !

సర్వర్ పనిచేయక.. సరుకులు అందక !