
ప్రసూతి విభాగంలో కోతుల బెడద
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కోతుల బెడద అధికమైంది. ఈ విభాగంలో ఉదయం నుంచి రాత్రి వరకు కోతులు మందలు మందలుగా వస్తూ రోగులు, వారి సహాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల విభాగం, న్యూరాలజి, ఎండోక్రైనాలజి, గైనకాలజి విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు సైతం ఇవి చేరుకుంటూ వారి వద్ద ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. వార్డులోని వరండాల్లో భోజనం చేస్తున్న వారిపైనా దాడికి దిగి ఆహార పదార్థాలను లాక్కెళ్తున్నాయి. వార్డు బయట బైక్లు, స్కూటీలు, కార్లలో ఉంచిన పదార్థాలు, వస్తువులను సైతం తనిఖీ చేసి పారవేస్తున్నాయి. అందులో తినుబండారాలు ఉంటే వాటిని తీసుకెళ్తున్నాయి. మూకుమ్మడిగా వచ్చే వీటిని ఎలా తరిమేయాలా అని సెక్యూరిటీ గార్డులు తలపట్టుకుంటున్నారు. – కర్నూలు(హాస్పిటల్)

ప్రసూతి విభాగంలో కోతుల బెడద