
ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ ( సివిల్, ఏపీఎస్పీ) అభ్యర్థులకు కర్నూలులోని 16 కేంద్రాల్లో మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు శివారుల్లోని జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల, బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, కేవీ సుబ్బారెడ్డి కళాశాల, అతీనా స్కూల్, మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్, శంకరాస్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరిగిన తీరును పరిశీలించారు. 7,597 మంది అభ్యర్థులకు గాను 6,947 మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకు హాజరైనట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు జరిగాయన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా, డీఎస్పీలు శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, సీఐలు, ఎస్ఐలు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించారు.

ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష