
పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీపై కూటమి కుట్ర
బేతంచెర్ల: టీడీపీ నాయకుల స్వార్థ రాజకీయాలతో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయి. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ కల్పన విష యంలో టీడీపీ నాయకులు కొత్త నాటకానికి తెరలేపడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే నష్టాలతో ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభు త్వం హయాంలో మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించేందుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన కృషి ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుతం సవ్యంగా కొనసాగుతున్న పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని బెదిరించే ధోరణిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో స్థానికులను రెచ్చగొట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ ప్రాంతవాసుల ఉపాధి కల్పించాలనే నెపంతో సోమ వారం ఫ్యాక్టరీ ఎదుట టీడీపీ ధర్నాకు పిలుపు ఇచ్చింది. అయితే టీడీపీ నేతల తీరును గ్రామస్తులు, కార్మి కులు తప్పుపడుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో స్థానికులను
రెచ్చగొడుతున్న టీడీపీ నేతలు ?
ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని
బెదిరించే ప్రయత్నం
ధర్నాకు పిలుపు ఇవ్వడంతో
కార్మికులు, ప్రజల ఆందోళన