నా భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేదు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలీ పనికి వెళ్తున్నాను. ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలి.
– జాడి గున్నాబాయి, గంగాపూర్,
మం.చింతలమానెపల్లి
జాబితా సిద్ధం చేస్తున్నాం
కొత్త పింఛన్ల కోసం నిత్యం దరఖాస్తులు వస్తున్నాయి. వాటి ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తాం. అర్హులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. – దత్తారావు, డీఆర్డీవో


