● కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు హాజరైన మంత్రి సీతక్క
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదో రో జైన సోమవారం ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి నామినేషన్పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పట్టణంలోని రణదీవేనగర్కు చెందిన మేస్రం గంగాదేవి నామినేషన్ దాఖలు చేయగా, మరో స్వతంత్య్ర అభ్యర్థి రాథోడ్ సుభాష్ తరఫున మరో సెట్ దాఖలు చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆర్వోకు వారు నామినేషన్ పత్రాలు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు అందిన నామినేషన్ల సంఖ్య ఆరుకు చేరింది.