ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

Oct 30 2025 9:26 AM | Updated on Oct 30 2025 9:26 AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఖమ్మంక్రైం: భారీ వర్షాల నేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100తో పాటు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే పోలీస్‌ కంట్రోల్‌ నంబర్‌ 87126 59111కు సమాచారం అందించాలని చెప్పారు. వరద చేరిన రోడ్లను దాటే ప్రయత్నం చేయొద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

పగిడేరు ఉధృతి పరిశీలన

కొణిజర్ల: కొణిజర్ల మండలం లాలాపురం, తీగలబంజర మధ్య ఉన్న పగిడేరు వాగు ఉధృతిని సీపీ సునీల్‌దత్‌ పరిశీలించారు. ప్రజలు, వాహనదారులు బ్రిడ్జి దాటకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement