నిమ్మవాగులో కొట్టుకు పోయిన డీసీఎం
కొణిజర్ల/అశ్వారావుపేటరూరల్: కొణిజర్ల మండలం అంజనాపురం సమీపాన నిమ్మ వాగులో బుధవారం ఓ డీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మారుతినగర్కు చెందిన ఆరేపల్లి మురళి (32) మూడు రోజుల క్రితం అదే మండలం నారావారిగూడెం వాసి మునుగొండ వెంకటముత్యం డీసీఎం వ్యాన్కు డ్రైవర్గా వచ్చాడు. సుజాతనగర్లో పత్తి లోడ్ తీసుకుని వరంగల్ జిల్లాలో దిగుమతి చేసి బుధవారం వస్తుండగా అంజనాపురం వద్ద నిమ్మవాగు వరద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. కొణిజర్ల వైపు నుంచి డీసీఎంలో వస్తున్న మురళి వరద దాటేందుకు యత్నిస్తుండగా మరో వైపు ఉన్న స్థానికులు, ఏన్కూరు పోలీసులు వారించారు. అయినా వినకుండా ముందుకు సాగడంతో వరద ఉధృతికి వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడనే సమాచారం తెలియంతో ఎస్ఐ జి.సూరజ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలించగా సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియరాలేదు. కాగా, మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గల్లంతయ్యాడనే సమాచారం తెలియడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
కుటుంబానికి వృద్ధురాలి అప్పగింత
వైరా: ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన వృద్ధురాలిని గుర్తించిన పోలీసులు తిరిగి ఆమెను కుటుంబీకులకు అప్పగించారు. వైరా మున్సి పాలిటీ పరిధి శాంతినగర్కు చెందిన ధరావత్ సుశీల (60) మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించ గా ఎస్ఐ పి.రామారావు నేతృత్వాన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమె విజయవాడ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో ఆమెను వైరా తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు.
వరదలో
గల్లంతైన డ్రైవర్
నిమ్మవాగులో కొట్టుకు పోయిన డీసీఎం


