ఆయుర్వేదంతో ఆరోగ్య వృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదంతో ఆరోగ్య వృద్ధి

Dec 16 2025 4:49 AM | Updated on Dec 16 2025 4:49 AM

ఆయుర్వేదంతో ఆరోగ్య వృద్ధి

ఆయుర్వేదంతో ఆరోగ్య వృద్ధి

హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద చికిత్సకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆయుర్వేద చికిత్స దోహదపడుతుందని ఎమ్మెల్యే హెచ్‌.ఆర్‌.గవియప్ప తెలిపారు. ఆయుష్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని సాయిలీల కళ్యాణ మండపంలో నిర్వహించిన బోధవ్య–2025 విద్యాష్టికర్మ జాతీయ సదస్సును ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా ఆస్పత్రిలో ఆయుర్వేద చికిత్స కోసం 25 పడకలను కేటాయించే ప్రణాళిక ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయుర్వేద చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. జిల్లా ఆస్పత్రి కోసం రూ.40 కోట్ల విలువైన వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఆస్పత్రులను సందర్శించి వైద్య పరికరాలను తనిఖీ చేశారన్నారు. అనంతరం ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ చంద్రకుమార్‌ దేశ్‌ముఖ్‌ విద్యాష్టికర్మ గురించి ప్రత్యేక సమాచారం ఇచ్చారు. విద్యాష్టికర్మ ద్వారా 50 మందికి పైగా రోగులకు తక్షణ ఉపశమనం లభించింది. హోటల్‌ వ్యాపారి అభిషేక్‌, రాజీవ్‌ గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ సిద్దనగౌడ పాటిల్‌, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ ఫణీంద్ర, ఆయుష్‌ ఫెడరేషన్‌కు చెందిన డాక్టర్‌ బీవీ భట్‌, డాక్టర్‌ చేతన్‌, డాక్టర్‌ గురు మహంతేష్‌, డాక్టర్‌ కాశీలింగయ్య, డాక్టర్‌ దాసురావు, డాక్టర్‌ మోహన్‌ బిరాదార్‌, డాక్టర్‌ సోమశేఖర్‌ హుద్దార్‌, డాక్టర్‌ కుంబార్‌, డాక్టర్‌ సునీల్‌ హిరేమట్‌్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement