కులగణనకు వెళ్లి చెరువులో శవమై... | - | Sakshi
Sakshi News home page

కులగణనకు వెళ్లి చెరువులో శవమై...

Oct 16 2025 5:05 AM | Updated on Oct 16 2025 5:05 AM

కులగణ

కులగణనకు వెళ్లి చెరువులో శవమై...

కోలారు: సామాజిక విద్యా సమీక్ష (కుల గణన) కోసం వెళ్లిన ఉపాధ్యాయురాలు చెరువులో శవమై తేలింది. వివరాలు.. కోలారు నగరానికి చెందిన అక్తర్‌ బేగం (50) మంగళవారం సమీక్ష కోసం నరసాపురానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు నగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం కేజీఎఫ్‌ తాలూకా అయ్యప్పల్లి చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. అక్తర్‌ బేగం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేతమంగల పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి ఎస్‌ఎన్‌ఆర్‌ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె బస్సులో వెళ్లినట్లు టికెట్‌ లభ్యమైంది.

కులగణనకు వెళ్లి  చెరువులో శవమై...  1
1/1

కులగణనకు వెళ్లి చెరువులో శవమై...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement