సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు

Sep 26 2025 7:12 AM | Updated on Sep 26 2025 7:12 AM

సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు

సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు

బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు న్యాయశాఖమంత్రి హెచ్‌కే.పాటిల్‌ తెలిపారు. గురువారం సీఎం సిద్దరామయ్య అద్యక్షతన నిర్వహించిన క్యాబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఆ వివరాలను పాటిల్‌ మీడియాకు వెల్లడించారు. సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనలేదని ఫిర్యాదులు అందుతున్నాయి, హాజరు కానివారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్‌కు అప్పగించామని చెప్పారు.

కొన్ని ముఖ్య తీర్మానాలు

● డీఎస్పీ గణపతి ఆత్మహత్య మీద కేఎన్‌.కేశవనారాయణ విచారణ కమిటీ నివేదికను కేబినెట్‌ తిరస్కరించింది.

● ప్రభుత్వ అధికారులకు వారి స్థాయికి అనుగుణంగా వృత్తి నైపుణ్య కోర్సులు తప్పనిసరి

● బెంగళూరులో అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పథకానికి రూ.56.45 కోట్లు కేటాయింపు

● ఢిల్లీలో చాణక్యపురిలో రూ.16 కోట్లతో కర్ణాటక భవన్‌ అభివృద్ధి పనులు

● 2019కి ముందు ఉన్న అన్ని వాహనాల డిజిటలరీకరణ కోసం రవాణాశాఖకు

రూ.40 కోట్లు

● బెంగళూరులో పలు ప్రాంతాలలో భూగర్భ మురుగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు. దేవనహళ్లి వద్ద ఐటీపార్కు, ఎలెమల్లప్పబెట్ట, సాదరమంగల తదితర ప్రాంతాలలో ఏర్పాటుకు నిర్ణయం.

కేబినెట్‌ భేటీలో నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement