
న్యాయవాదులకు బార్ పరీక్షలు రద్దు చేయాలి
రాయచూరు రూరల్: దేశంలో న్యాయవాదులకు బార్ పరీక్షలను రద్దు చేయాలని అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శశిధర్ కెల్లూరు మాట్లాడారు. న్యాయవాదులు, లా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ న్యాయవాదులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టంలోని లోపాలను సవరించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.20 వేల సహాయ ధనం ఇవ్వాలన్నారు. సంఘానికి రూ.10 లక్షల నిధులు కేటాయించాలన్నారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమా పాలసీ చేయించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కి వినతిపత్రం సమర్పించారు.