
ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యారంగంలో ప్రైవేట్ పాఠశాలల కన్నా తామేమీ తక్కువ కాదంటూ సర్కారు బడులు అక్కడక్కడా పోటీ పడుతున్నాయి. కళ్యాణ కర్ణాటకలో కాన్వెంట్ బడిని పోలిన రీతిలో బీదర్ జిల్లాలో 60 ఏళ్ల పాఠశాల ప్రైవేట్ పాఠశాలను మరిపిస్తోంది. ఉపాధ్యాయులు, అధికారులు తలుచుకుంటే మార్గాలెన్నో ఉంటాయి అనే విధంగా పాఠశాలను రూపాంతరం చేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించడానికి ఉపాధ్యాయుల శ్రమ మరువరానిదని చెప్పవచ్చు. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా బోరళలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కాన్వెంట్ స్థాయికి చేర్చారు. 1 నుంచి 7వ తరగతి వరకు 116 మంది విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలనే తపనతో పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుడు సతీష్ నడుం బిగించారు. పాఠశాల పాత విద్యార్థులు, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులతో చర్చించి నిధులు సేకరించి సర్వాంగ సుందరంగా ఆధునికీకరణ చేశారు.
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఏడు మంది ఉపాధ్యాయులు శ్రమ వహించి పాఠశాలను అభివృద్ధి పరిచి నల్లబోర్డు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. శాసన సభ్యుడు ప్రభు చౌహాన్ సహకారంతో కేకేఆర్డీబీ ద్వారా రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించుకొని ఐదు పాఠశాల గదులను నిర్మించుకొని గదులకు కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల రక్షణ గోడ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సహకారం అందించింది. పాత విద్యార్థుల నుంచి రూ.1.12 లక్షల నిధులను సేకరించారు. పాఠశాలకు రంగు రంగుల పెంయింటింగ్లతో అలంకరించారు. పాఠశాలలో సీసీ టీవీ కెమెరాలు, తాగునీరు, ఇన్వర్టర్, బెంచీలు, కుర్చీలు, టేబుల్ ఇతర సౌకర్యాలు కల్పించారు. గోడలపై రూ.1.50 లక్షలతో పెయింటింగ్ వేసి పిల్లలను పాఠశాల వైపు దృష్టి మళ్లించడానికి ఉపాధ్యాయుల కృషి మరువరానిది. ఇంటింటికీ వెళ్లి పిల్లలను పాఠశాలకు పంపాలని పెద్దలను కోరారు.
బీదర్ జిల్లాలో మోడల్ పాఠశాలగా
నిలిచిన వైనం
కాన్వెంట్గా రూపాంతరం చెందిన
60 ఏళ్ల స్కూల్

ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి

ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి

ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి

ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి