
సింహ, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడు
ఉరవకొండ రూరల్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి వారు సింహ, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం స్వామి వారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సింహ, చంద్రప్రభ వాహనాలపై ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించగా.. శ్రీవారిని భక్తులు దర్శించుకుని పరవశించారు. అంతకుముందు లక్ష్మీనృసింహుని జయంతి సందర్భంగా విశేష పుష్పాలతో మూలవిరాట్ను అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. భక్తులు స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కార్యక్రమంలో ఉత్సవ ఉభయదాతలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.