
కోట్ల ఆస్తిని వదిలి.. సన్యాస దీక్షకు కదిలి ●
● యాదగిరి జిల్లా నుంచి రెండో వ్యక్తి
● పారిశ్రామికవేత్త అసాధారణ నిర్ణయం
రాయచూరు రూరల్: కోట్లకు పడగలెత్తిన ఓ పారిశ్రామికవేత్త తన యావదాస్తిని వదిలి సన్యాసాశ్రమ దీక్షకు పూనుకున్న ఘటన కల్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గతంలో యాదగిరిలో 26 ఏళ్ల నిఖిత అనే యువతి కూడా దీక్ష పొంది రెండు నెలలు కాకుండానే తాజాగా యాదగిరి తాలూకా సైదాపూర్కు చెందిన దిలీప్ కుమార్ దోఖా అనే 55 ఏళ్ల వ్యక్తి అదే జిల్లా నుంచి సన్యాసాశ్రమం పొందిన రెండో వ్యక్తిగా నిలిచారు. భార్య లీలాబాయి, ముగ్గురు ఆడ పిల్లలను వదిలి దిలీప్ కుమార్ దీక్షకు పూనుకున్నారు. 12 ఏళ్ల పాటు అమెరికాలో వ్యాపారాలు చేసి బెంగళూరులో కోట్ల ఆస్తులు సంపాందించారు.