సిటీ బస్‌లో బాలికపై వేధింపులు? | - | Sakshi
Sakshi News home page

నీ తండ్రి ఏమైనా సీఎం, పీఎమ్మా?

Aug 14 2023 12:48 AM | Updated on Aug 14 2023 7:52 AM

- - Sakshi

బీఎంటీసీ బస్సులో విద్యార్థినులపై పట్టపగలే కండక్టర్‌, ఇద్దరు పురుషులు వేధించారు. ఈ కీచకకాండపై తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు.

కర్ణాటక: బీఎంటీసీ బస్సులో విద్యార్థినులపై పట్టపగలే కండక్టర్‌, ఇద్దరు పురుషులు వేధించారు. ఈ కీచకకాండపై తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. వివరాలు.. ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక దొమ్మలూరు నుంచి రిచ్మండ్‌ సర్కిల్‌కు ప్రయాణం చేస్తుండేది. గుంజూరు డిపో, 41, కేఎ 57–ఎఫ్‌2695 బస్సులో బాలిక ఉచిత ప్రయాణం కోసం ఆధార్‌ కార్డు చూపింది.

కండక్టర్‌ చూసి అందులో వేరేభాష ఉంది, డబ్బులిచ్చి టికెట్‌ తీసుకోమన్నాడు. సరేనని బాలిక టికెట్‌ కొనుక్కుంది. కానీ కండక్టర్‌, ఇద్దరు పురుషులు బాలికను చూస్తూ మాపైన నీ తల్లిదండ్రులకు చెబుతావా? నీ తండ్రి ఏమైనా సీఎం, పీఎమ్మా? అని గద్దించారని, మెడపట్టుకుని బయటకు తోసేయడానికి యత్నించారని బాలిక తల్లి ఆరోపించింది. రిచ్మండ్‌ సర్కిల్‌లో దింపకుండా, కార్పొరేషన్‌ సర్కిల్‌ వద్ద విద్యార్థినిని దింపి వెళ్లారని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement