ఏసీబీ కోర్టు కరీంనగర్‌ ఇన్‌చార్జి పీపీగా ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టు కరీంనగర్‌ ఇన్‌చార్జి పీపీగా ప్రసాద్‌

Jun 14 2025 9:52 AM | Updated on Jun 14 2025 10:30 AM

ఏసీబీ

ఏసీబీ కోర్టు కరీంనగర్‌ ఇన్‌చార్జి పీపీగా ప్రసాద్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వేముల లక్ష్మీప్రసాద్‌ను కరీంనగర్‌ ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి పీపీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సాంబశివారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ప్రసాద్‌ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్‌ మాట్లాడుతూ సాక్షులు భయపడకుండా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరారు. ఎవరైనా నిందితులు సాక్షులను భయపెడితే పోలీస్‌స్టేషన్‌లో దరాఖాస్తు ఇస్తే పోలీసులు వారిపై కేసు నమోదు చేస్తారన్నారు.

సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌టర్మ్‌కు ఉచిత శిక్షణ

కరీంనగర్‌/పెద్దపల్లిరూరల్‌: ఉమ్మడి కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణ కోసం బీసీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 16వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి జూలై 25 నుంచి వచ్చే ఏడాది 30వ తేదీవరకు ఉచిత శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గలవారు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. వివరాలకు 040–24071178 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.

దళారుల చేతుల్లోకి దేశ సంపద

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

జగిత్యాలటౌన్‌: ప్రజల మధ్య బీజేపీ మతం పేరుతో చిచ్చు పెడుతుందని, దేశ సంపదను పెత్తందార్లకు దోచిపెట్టేందుకు మోదీ దళారీల వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా 4వ మహాసభలు జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్‌ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు జగిత్యాల టవర్‌ సర్కిల్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా మీదుగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీజేపీ 11ఏళ్ల పాలనలో దేశంలో పేదరికం పోయిందనడం పచ్చి అబద్ధమన్నారు. పేదరికం పోతే ఇంకా రేషన్‌ కార్డులు ఎందుకని ప్రశ్నించారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యునిస్టులంటే బూర్జువా పార్టీలకు ఎప్పటికీ నచ్చదన్నారు. ఎర్ర జెండా ఎప్పటికీ పేదలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దగాకోరు విధానాలతో దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్‌ ముందుచూపుతో పేదల హక్కులు కాపాడేలా రాజ్యాంగాన్ని రచిస్తే మోదీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కమ్యునిస్టులందరూ ఐక్యమై మోదీని గద్దె దించేలా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నాయకులు సుతారి రాములు, ఎన్నం రాధ, ఇరుగురాళ్ల భూమేశ్వర్‌, ఎండీ అక్రం, వెన్న మహేశ్‌, మునుగూరి హన్మంతు పాల్గొన్నారు.

ఏసీబీ కోర్టు కరీంనగర్‌      ఇన్‌చార్జి పీపీగా ప్రసాద్‌1
1/1

ఏసీబీ కోర్టు కరీంనగర్‌ ఇన్‌చార్జి పీపీగా ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement