కనగర్తిలో దొంగతనం | - | Sakshi
Sakshi News home page

కనగర్తిలో దొంగతనం

Jun 14 2025 9:52 AM | Updated on Jun 14 2025 10:30 AM

కనగర్

కనగర్తిలో దొంగతనం

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో శుక్రవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన వంగపెల్లి శంకర్‌ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను తెరిచి వస్తువులు చిందరవందర చేశారు. చిన్నారుల కిడ్డీ బ్యాంక్‌ డబ్బాను పగులగొట్టి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.10వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు.

కేటీఆర్‌పై ఫిర్యాదు

మల్యాల(చొప్పదండి): సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నాయకుడు సంత ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని చేతగానివాడు, రాష్ట్రాన్ని నడిపే సత్తాలేనివాడంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కోరెపు వెంకటేశ్‌, తిపిరెడ్డి కిషన్‌రెడ్డి, కొత్తకొండ శ్రీనివాస్‌, ఏలేటి కిష్టరెడ్డి, మహేశ్‌రెడ్డి, కటుకం వినయ్‌ పాల్గొన్నారు.

యువకుడి దారుణ హత్య

గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మెండె సతీశ్‌యాదవ్‌(30) శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులో మల్లారెడ్డిపేటకు వెళ్లేదారిలో సతీశ్‌ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృతుడు స్థానికంగా వ్యవసాయపనులు, గొర్రెల కాపరీ, మేసీ్త్ర పనులు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సై ప్రేమానందం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కనగర్తిలో దొంగతనం1
1/1

కనగర్తిలో దొంగతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement