‘సీఎమ్మార్‌’లో వేగం | - | Sakshi
Sakshi News home page

‘సీఎమ్మార్‌’లో వేగం

Jun 13 2025 5:07 AM | Updated on Jun 13 2025 5:07 AM

‘సీఎమ్మార్‌’లో వేగం

‘సీఎమ్మార్‌’లో వేగం

● రికార్డుస్థాయిలో బియ్యం డెలివరీ ● వానాకాలం సీజన్‌లో పెరిగిన వేగం ● ముందంజలో పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలు ● జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో నత్తనడకనే సాగిన వైనం

సాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎమ్మార్‌– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చిన రైస్‌ మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్‌పై ప్రత్యే కంగా దృష్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. గ్యారంటీ బాండ్‌లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్‌ దందాకు చెక్‌పెట్టినట్లయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శా తంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే, జగి త్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్‌ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి.

బ్యాంక్‌ గ్యారంటీ షరతు

కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభు త్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు క్వింటాల్‌ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్‌రైస్‌, 67 కిలోల రారైస్‌ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైన రేషన్‌బియ్యం కోటా తీసు కొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్ప గించాలి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా తమ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకునేవారు. బియ్యం అప్పగించకుండానే ధాన్యాన్ని విక్రయించి ఆ డబ్బతో వ్యాపారాలు నిర్వహించేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్‌మిల్లర్లుకు వరంగా మారినా అధికారులు పటిచుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతోనే మిల్లర్లు సీఎమ్మార్‌ ఇవ్వడంలో జాప్యం చేసేవారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌, రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమో దు చేయడంతోపాటు ఆస్తుల జప్తుకూ వెనుకాడడం లేదు. దీంతోపాటు, సీమ్మార్‌ డిఫాల్ట్‌ను నివారించడానికి బాండ్‌లు ఇచ్చినవారికే ధాన్యం కేటాయింపులు చేశారు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించి న మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మరీ మిల్లింగ్‌ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్‌ డెలివరీ వేగవంతమైంది.

రికార్డు నమోదు

రైస్‌మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్‌ను త్వరగా పూర్తిచేయాలి. గత వానాకాలం మిల్లింగ్‌ను త్వరగా పూర్తిచేసేలా తీసుకున్న చర్యలతో సీఎమ్మార్‌ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండోస్థానంలో ఉంది.

– శ్రీకాంత్‌రెడ్డి, డీఎం, పెద్దపల్లి పౌర సరఫరాలు

2024–25 వానాకాలం సీజన్‌ సీఎమ్మార్‌(మెట్రిక్‌ టన్నుల్లో)

జిల్లా ఇచ్చిన ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చింది శాతం

పెద్దపల్లి 2,97,379 1,99,750 1,80,487 90

కరీంనగర్‌ 2,60,679 1,75,589 1,43,946 82

జగిత్యాల 3,08,271 2,08,277 1,19,642 57

సిరిసిల్ల 2,11,572 1,42,327 61,364 43

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement